పంజాబ్, గుర్దాస్పూర్లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. పంజాబ్లో 37 ఏళ్ల మహిళ తన 18 ఏళ్ల కుమార్తెను 21 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం చేసింది. ఆ యువ జంట ఇప్పుడిప్పుడే కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే ఆ 37 మహిళ చేసిన కార్యం సంచలనానికి దారితీసింది. ఆమె తన అల్లుడికి సోదరుడైన 22ఏళ్ల వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. తన అల్లుడి సోదరుడిని ప్రేమించడం ద్వారా తన భర్తకు దూరమైంది. ఇంకా విడాకులు కూడా పుచ్చుకుంది. ఆపై తనకంటే 15 ఏళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకుంది. అయితే వీరి ప్రేమ వ్యవహారం అల్లుడికి కూతురికి తెలియ రావడంతో బంధువులతో పాటు వీరి పెళ్లిని వ్యతిరేకించారు. దీంతో 37 ఏళ్ల మహిళ.. తాను వివాహం చేసుకున్న వ్యక్తితో కలిసి భద్రత కల్పించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై ఈ నెల 31వ తేదీన విచారణకు రానుంది. అన్నాదమ్ముళ్లు, తల్లిని కుమార్తెను వావివరుసలు లేకుండా వివాహం చేసుకోవడం పెను సంచలనానికి దారితీసింది.
అయోధ్యలో మసీదు నిర్మాణం.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు