telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీ నేత‌లు నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలి..

*నడ్డా పర్యటనతో ఏపీలో బీజేపీ కొత్త ఉత్సాహం..
*ఇష్టానుసారంగా మాట్లాడితే ఖ‌బ‌డ్డార్

వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు. మాది పువ్వు పార్టీనా? అడ్డంగా బ‌లిశారంటూ మా న‌డ్డాను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శిస్తారా..? మాజీ మంత్రులివి ఒళ్లు బ‌లిసిన మాట‌లు అని నరసింహారావు మండిప‌డ్డారు

మీదే డొక్కు ఫ్యాన్ పార్టీ ..చెత్త ఫ్యాన్ పార్టీ అందరికీ అర్థమయ్యాయని అన్నారు. డబ్బా ఫ్యాన్ తిరిగి త‌మ నెత్తి మీద ఎప్ప‌డు పడుతుందా అనే భ‌యంతో ప్ర‌జ‌లు ఉన్నార‌ని..ఇష్టానుసారంగా మాట్లాడితే ఖ‌బ‌డ్డార్ అంటూ జీవీఎల్ వార్నింగ్ ఇచ్చారు.

కేంద్రం ఎంత సాయం చేసింది..మీరు దేనికి ఎంత వాడారు? ఆర్ధిక మంత్రితో బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ర్చిస్తారా అంటూ ప్ర‌శ్నించారు. అర్ధిక మంత్రి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసేది అప్పుల కోసమే కాదా అని ప్రశ్నించారు.

వైసీపీ నేత‌లు మాట్లాడే ప్ర‌తీ చెత్త మాట మా పెద్ద‌ల‌తో త‌ర్జుమా చేసి మ‌రీ తీరుతామ‌ని అన్నారు. లిక్కర్, ఇసుక మాఫియాలతో రూ.కోట్లు దండుకున్నారని మండిపడ్డారు.

జొన్నాడ వెళితే బీజేపీ నేత సోము వీర్రాజును అడ్డుకున్నారన్నారు. ఏపీని నిషేధిత ప్రాంతంగా ఏమైనా పరిగణిస్తున్నారా అంటూ నిలదీశారు. కేంద్ర సాయం, ఖర్చులు, పథకాలపై చర్చకు సిద్ధమని జీవీఎల్ స్పష్టం చేశారు.

Related posts