భారత యువ వికెట్ కీపర్/ బ్యాట్స్మెన్ కేఎస్ భరత్ పెళ్లి చేసుకున్నాడు. దాదాపు పదేళ్ల నుంచి అంజలి అనే అమ్మాయితో డేటింగ్లో ఉన్న భరత్.. తాజాగా మూడు ముళ్ల బంధంతో ఒక ఇంటివాడయ్యాడు. ఈ విషయాన్ని భరత్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేశాడు. ఆంధ్రా తరఫున దేశవాళీ క్రికెట్లో ఆడుతున్న భరత్.. ఇప్పటి వరకూ 78 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడి 4,283 పరుగులు చేశాడు. అలానే 51 లిస్ట్-ఎ మ్యాచ్ల్లో 1,351 పరుగులు, 43 టీ20ల్లో 615 రన్స్ చేశాడు. ఐపీఎల్లోనూ ఢిల్లీ డేర్డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) టీమ్లోకి ఎంపికయ్యాడు. కానీ.. ఒక్క మ్యాచ్లో కూడా అతనికి తుది జట్టులో ఛాన్స్ లభించలేదు. దాంతో.. టీమిండియాతో పాటు ఐపీఎల్లోనూ అతని అరంగేట్రం పెండింగ్లో ఉండిపోయింది. కానీ.. బంగ్లాదేశ్తో ఆ డే/నైట్ టెస్టు గెలిచిన తర్వాత ట్రోఫీని నేరుగా తీసుకొచ్చి భరత్ చేతికి కెప్టెన్ విరాట్ కోహ్లీ అందించి.. అతడ్ని గౌరవించాడు. గత ఏడాది నవంబరులో బంగ్లాదేశ్తో జరిగిన చారిత్రక డే/నైట్ టెస్టు (పింక్ బాల్) మ్యాచ్కి భారత్ జట్టులోకి ఎంపికైన కేఎస్ భరత్కి తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేకి కూడా భరత్కి పిలుపు వచ్చింది. కానీ.. అప్పుడు కూడా తుది జట్టులో మొండిచేయి ఎదురైంది. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గత ఏడాది కాలంగా టీమిండియాకి దూరంగా ఉంటుండగా.. యువ వికెట్ కీపర్లని సిద్ధం చేసుకునే క్రమంలో భారత సెలక్టర్లు రిషబ్ పంత్కి వరుస అవకాశాలిచ్చారు. కానీ.. అతను వాటిని వినియోగించుకోలేకపోయాడు. దాంతో.. కేఎస్ భరత్కి ఒక ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్ గత ఏడాదికాలంగా వినిపిస్తోంది.
View this post on Instagram
We found love ❤️❤️ So much to look forward🤗 #myvalentine#precious#decadestrongandcounting