telugu navyamedia
National నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు సాంకేతిక

ఏఐ మనల్నికాదు, మనం ఏఐని శాసించేలా ఉండాలి: ప్రధాని మోదీ

ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి 500కు పైగా కంపెనీల ప్రతినిధులు హాజరైనారు.

పలు కంపెనీల సీఈవోలతో ప్రధాని రౌండ్‌టేబుల్ మీట్ , ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్.

‘ప్రపంచంలో ఆరో వంతుకు భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది ఏఐపై తొలినాళ్లలో అనేక అనుమానాలు వచ్చాయి.

ఇప్పుడు ఏఐని యువత ప్రయోజనకరంగా వాడుకుంటోంది, భారత్ కొత్త టెక్నాలజీ తయారు చేస్తోంది వినియోగిస్తోంది మానవ చరిత్రలో ఏఐ సరికొత్త మలుపు లాంటిది.

ఏఐ ట్రాన్స్‌ఫర్మేటివ్ పవర్ ఏఐకి మానవుడు ముడి సరుకులా మారొద్దు. ఏఐ మనల్ని కాదు, మనం ఏఐని శాసించేలా ఉండాలి.

ఏఐని ఎలా ముందుకు తీసుకెళ్తామో అలా మన భవిష్యత్ ఉంటుంది. అణుశక్తితో వినాశనం చూశాం మంచినీ చూశాం’ అని ప్రధాని మోదీ అన్నారు.

Related posts