telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పెందుర్తి కేసు : ఇంకా మృతదేహాలకు పూర్తి కానీ పోస్ట్‌మార్టం…

తన కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన అప్పల రాజుతో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంటేనే పోస్ట్‌మార్టానికి అంగీకరిస్తామని అంటున్నాడు బాధితుడు విజయ్‌, అతని బంధువులు. బత్తిన అప్పలరాజుతోపాటు దుర్గాప్రసాద్‌, గౌరీష్‌, శ్రీనులను కూడా శి్‌క్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విశాఖ మార్చురీ  దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ ఆరు మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి  కాలేదు. జుత్తాడ శెట్టిబలిజ వీధికి చెందిన బత్తిన అప్పలరాజుకు, పొరుగున నివసించే విజయ్‌ కుటుంబంతో పాత కక్షలున్నాయి. దీంతో అదను చూసి విజయ్‌ కుటుంబంపై దాడి చేశాడు అప్పలరాజు. ఇంట్లో ఉన్న ఆరుగుర్ని కత్తితో నరికి చంపాడు. విజయ్‌ తండ్రి బమ్మిడి రమణ, భార్య ఉషారాణి, రెండేళ్ల కొడుకు ఉదయ్‌, ఆరు నెలల కూతురు ఉర్విషను కత్తితో అతి కిరాతకంగా నరికి చంపాడు అప్పలరాజు.

Related posts