ఏబీ డివిలియర్స్పై వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. వైవిధ్యమైన ఆటతీరుతో మైదానం నలుమూలల ఆడే ఏబీడిని అభిమానులు ముద్దుగా మిస్టర్ 360 అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. 2018లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన డివిలియర్స్.. అప్పటి ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించినా.. ఆటకు దూరమైనా అతనిలోని సత్తా మాత్రం ఏ మాత్రం తగ్గలేదని ప్రతీ సీజన్లోనూ నిరూపిస్తున్నారు. ఈ సీజన్ లో కూడా బ్యాట్ అందుకున్న డివిలియర్స్ విధ్వంసం సృష్టించాడు. 7 మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అతను ఆడిన ఇన్నింగ్స్ ఈ సీజన్కే హైలైట్. ముఖ్యంగా ఆ మ్యాచ్లో చివరి ఓవర్ వేసిన మార్కస్ స్టోయినిస్ను చీల్చించెండాడాడు. తాజాగా ఈ ఇన్నింగ్సేనే ప్రస్తావించిన సెహ్వాగ్.. ఏబీడీలా మరే ఆటగాడు ఆడలేడని ప్రశంసించాడు. ‘ప్రజలంతా ఏబీ డివిలియర్స్ అసలు పేరు మర్చిపోవచ్చు. కానీ మిస్టర్ 360 డిగ్రీ అనే అతని ట్యాగ్ను మాత్రం అస్సలు మరిచిపోరు. అతనికి మరో పేరు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. క్రికెట్లోకి కొత్తగా ఎంత మంది వచ్చినా.. ఏబీడీ ప్రత్యేకత ఏబీడీదే అని పేర్కొన్నాడు.
previous post