ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ తబ్లీగి జమాత్ కు హాజరైనవారిలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. తాజాగా ఈ ఘటనపై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. జమాతే ఇస్లామీ అధ్యక్షులు హమిద్ మహ్మద్ ఖాన్ గారూ కేవలం ఎంపిక చెయ్యబడిన ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తామని అన్నారు. ఆ వ్యక్తుల వివరాలు, ఫోన్ నెంబర్లు ఎందుకు ఇవ్వడం లేదు? ఇచ్చి ముస్లిం సమాజాన్ని ఆరోపణల నుంచి కాపాడే ప్రయత్నం ఎందుకు చెయ్యడం లేదు. అయినప్పటికీ, సమాజ శ్రేయస్సు దృష్ట్యా వారందరికీ పిలుపు ఇచ్చినందుకు మహ్మద్ ఖాన్ గారికి కృతజ్ఞతలు. ఇప్పటికైనా ప్రయాణీకులు వివరాలిచ్చి తమను, తమ కుటుంబాలను, సమాజాన్నికాపాడాలి. కుట్ర కోణమనే ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవాలి. ఇది భవిష్యత్లో అమాయకులను ఇబ్బందులకు గురి చెయ్యకుండా ఉంటుంది. అంటూ రాములమ్మ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
జమాతే ఇస్లామీ అధ్యక్షులు హమిద్ మహ్మద్ ఖాన్ గారూ,
మేము ఎవరుబడితే వారిని పిలవం… కేవలం ఎంపిక చెయ్యబడిన ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తామని అన్నారు. ఆ వ్యక్తుల వివరాలు, ఫోన్ నెంబర్లు ఎందుకు ఇవ్వడం లేదు? ఇచ్చి ముస్లిం సమాజాన్ని ఆరోపణల నుంచి కాపాడే ప్రయత్నం ఎందుకు చెయ్యడం లేదు?
— VijayashanthiOfficial (@vijayashanthi_m) April 1, 2020