telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టిడిపి అంటే తెలుగు డ్రామా పార్టీ : విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. “ఏమి నాటకాలయ్యా చంద్రం! అందుకే మీది తెలుగు డ్రామా పార్టీ అన్నది. అసెంబ్లీకి డుమ్మాకొట్టి తెలంగాణ నుంచి జూమ్ లో అసెంబ్లీ పెట్టేశాడు. పచ్చ నేతలే స్పీకర్ – మంత్రులట! ఇంకా ఢిల్లీలో చక్రం తిప్పేస్తున్నానన్న భ్రమల్లోనే ఉన్నాడు. ఇంతకీ పుత్రరత్నం లోకేశంకి ఏం మంత్రి పదవిచ్చాడో బాబు?” అంటూ ఎద్దేవా చేశారు జయసాయిరెడ్డి. ఇక అంతకు ముందు ట్వీట్ లో సిఎం జగన్ పై  విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. సిఎం జగన్ ఒక్కసారి హామీ ఇస్తే.. కచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటాడని విజయసాయిరెడ్డి కొనియాడారు. “హామీ ఇస్తే నిలబెట్టుకోవడం జగన్ గారి సహజ గుణం – సహజ శైలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఫిబ్రవరిలోనే మాటిచ్చారు…అసెంబ్లీలో తీర్మానం చేసి మాట నిలబెట్టుకున్నారు. ఏపీ గుండె చప్పుడును ఢిల్లీలో వినిపించడానికి ఏమాత్రం వెనుకాడని ప్రభుత్వమిది.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Related posts