telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఫేక్ వార్తలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం: విజయసాయిరెడ్డి

Vijayasai reddy ycp

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. కియా కంపెనీ లేచిపోతోందంటూ ఫేక్ వార్తలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.చంద్రబాబు మాజీ పీఏపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చంద్రబాబును ఉద్దేశించి మాజీ పీఏతో పాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరు విప్పడం లేదని ఆయన అన్నారు. నిప్పుకణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని చంద్రబాబు ఇప్పటికే ఐటీ శాఖను నిలదీయాలని ఎద్దేవా చేశారు. ఈ సోదాలపై రెండు రోజులుగా కిక్కురుమనకుండా ఉన్నారని పేర్కొన్నారు.

Related posts