లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఈ లాక్డౌన్ను కొంతమంది దర్శకులు ప్రమోషన్ల కోసం ఉపయోగించుకుంటున్నారు. మోషన్ పోస్టర్లు, ఫస్ట్లుక్ లాంటివి విడుదల చేసి… తమ తమ సినిమాలపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీమ్ టైటిల్ మోషన్ పోస్టర్తో పాటు చెర్రీకి సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇక ఎన్టీఆర్ వీడియోపై కూడా ఇప్పుడు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు అల్లు అర్జున్ టీమ్ కూడా ప్రమోషన్లను ప్రారంభించేసింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న AA20కి సంబంధించిన అప్డేట్ను బుధవారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇలా మిగిలిన హీరోలు ప్రమోషన్లను చేస్తుంటే.. ప్రభాస్ టీమ్ మాత్రం సైలెంట్గా ఉంది. దానికి తోడు త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని దర్శకుడు రాధాకృష్ణకుమార్ ఆ మధ్యన ప్రకటించినప్పటికీ.. తరువాత ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీంతో యూవీ క్రియేషన్స్పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. #BanUVCreations అంటూ వారు కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో యూవీ క్రియేషన్స్ స్పందించింది. ”ప్రపంచమంతా ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితిపై మేము చింతిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా పనులన్నీ మేము ఆపేశాం. ఒక్కసారి అన్ని పరిస్థితులు సర్దుకున్నాక.. మేము చాలా అప్డేట్లు ఇస్తాం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇంట్లో ఉండి సురక్షితంగా ఉండండి అని అందరినీ కోరుతున్నాం” అని యూవీ క్రియేషన్స్ తెలిపింది.
previous post
పవన్ పై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు