telugu navyamedia
రాజకీయ వార్తలు

ఎయిర్ ఇండియా విమానాలను అడ్డుకున్న అమెరికా!

Air India flight

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకుని వచ్చేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. భారతీయులను స్వదేశానికి చేర్చే ఉద్దేశంతో కాకుండా, వ్యాపార ధోరణితో ఎయిర్ ఇండియా వ్యవహరిస్తోందని యూఎస్ ఏవియేషన్ అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానాలను అమెరికా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. టికెట్లను సాధారణ ప్రజలకు కూడా విక్రయిస్తున్నారని ఆరోపించింది.

ఇరు దేశాల మధ్యా ఉన్న పౌరవిమానయాన ఒప్పందానికి విఘాతం కలిగించేలా ఎయిర్ ఇండియా వ్యవహరిస్తోందని యూఎస్ ట్రాన్స్ పోర్ట్ విభాగం అధికారులు అంటున్నారు. ఈ మేరకు 30 రోజుల పాటు కొత్త ఆంక్షలను పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన కంపెనీలు ఇండియాకు విమానాలను నడపకుండా భారత్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానాలు అమెరికాకు వెళుతుండటంతో, వాటిల్లో సాధారణ ప్రయాణికులు లండన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు ప్రయాణాలు సాగిస్తున్నందున అమెరికా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts