మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన డెబ్యూ సినిమా ‘ఉప్పెన’. కృతిశెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇక సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సాంగ్స్ ఇప్పటికే ట్రెండింగ్ లో రికార్డ్స్ సాధిస్తున్నాయి. ‘ఉప్పెన’ పూర్తి స్థాయి ప్రేమ కథ కావడంతో వ్యాలంటైన్స్ డే సీజన్లో ఫిబ్రవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కాగానే మంచి హిట్ కొట్టింది. రికార్డు స్థౄయిలో వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే 50 కోట్లు దాటేసింది. ఇక తాజాగా.. ఈ సినిమా నుంచి సంద్రంలోన నీరంతా అనే లిరికల్ సాంగ్ను రిలీజ్ చేసింది చిత్రం బృందం.
previous post
next post