telugu navyamedia
సినిమా వార్తలు

ఎమోషనల్ అయిన “ఇస్మార్ట్‌ శంకర్‌”… ఎందుకంటే…?

Ismart-Shankar

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్‌ శంకర్‌”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. అలాగే టీజ‌ర్‌, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వ‌చ్చింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు. దీంతో ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టింది చిత్రబృందం.

ఈ సినిమా సక్సెస్ కావాలని సందీప్ అనే అభిమాని తిరుమల మెట్లను మోకాళ్లతో ఎక్కారు. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఇది చూసిన రామ్ ఎమోషనల్ గా స్పందించారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో “డియర్ సందీప్.. నీ వీడియో చూశాను. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉందని ఆశిస్తున్నా.. నీ ప్రేమ నా హృదయాన్ని తాకింది.. బాధించింది.. షాక్ కి గురి చేసింది. మీరు ఇంత ప్రేమ, అభిమానం నాపై చూపించడానికి అంతగా నేనేం చేశానో అర్ధం కావడం లేదు. కానీ మీలాంటి వారి కోసం నా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది” అంటూ రాసుకొచ్చాడు. సదరు అభిమాని మోకాలిపై మెట్లు ఎక్కుతున్నవీడియో షేర్ చేసిన ఛార్మి.. “నువ్ నన్ను ఏడిపించేశావ్ సందీప్” అని ఎమోషనల్ అయింది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్లో నిర్వహించారు. రేపు ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ను గుంటూరులో ప్లాన్ చేశారు. గుంటూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో ఈవెంట్ ను నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ ఈవెంట్ ను జరపనున్నారు.

Related posts