ఈసీ మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ 3,239 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి భవితవ్యం ఈ రోజు తేలనుంది.
హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. 1168 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారి రాజకీయ భవిష్యత్ సైతం నేడు తేలనుంది. మహారాష్ట్ర, హర్యానా సహా దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల ఫలితాలు సైతం ఇవాళ వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు అధికారులు, పోలీసులు భారీ బందోమస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 21న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలతో కాంగ్రెస్ పూర్తిగా కొట్టుకుపోయిందా .. బీజేపీ అంతా ఆక్రమించేస్తుందా అనేది తేలనుంది.


ఆనాడు కేసీఆర్ మేల్కొని ఉంటే ఎంతో బాగుండేది: విజయశాంతి