రాంగోపాల్ వర్మకు దిమ్మదిరిగే షాకిచ్చింది తెలంగాణ హైకోర్టు. దిశ ఎన్కౌంటర్ చిత్రం దర్శకుడు రాం గోపాల్ వర్మ కు హైకోర్టు షోకాజు నోటీసు జారీ చేసింది. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలిపి వేయాలని హైకోర్టు ను ఆశ్రయించిన నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు.. ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కోర్టుకు తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణా మూర్తి. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించి వారిని ఊరిలో కూడా ఉండ నివ్వకుండా చేస్తున్నారన్న కృష్ణ మూర్తి. ఈ చిత్రం లో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరిన కృష్ణ మూర్తి.. దిశ సంఘటన పై ఒక పక్క జ్యుడీషియల్ కమిషన్ విచారణ జరుగుతున్న ఎలా చిత్రం తీస్తారని కోర్టుకు తెలిపారు. వెంటనే చిత్రం విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్ తరపు న్యాయవాది. సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, డైరెక్టర్ రాం గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ షోకాజు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
previous post

