telugu navyamedia
తెలంగాణ వార్తలు

మంత్రి మల్లారెడ్డి వాహనంపై రాళ్ల దాడి..ఉద్రిక్తత

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో జరిగిన రెడ్ల సింహ గర్జన స‌భ‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్ల‌డుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివ‌రించారు

తన ప్రసంగంలో పదే పదే కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను ప్రశంసించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం రెడ్లకు ఏం చేసిందో చెప్పాలని… రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటుపై ప్రకటన చేయాలని సభికులు మంత్రిని నిలదీశారు.

 దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మల్లారెడ్డిని పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్తుండగా.. ఆగ్రహించిన కొందరు కాన్వాయ్‌ వెంటపడి మరీ రాళ్లు, చెప్పులు, నీళ్ల బాటిళ్లతో దాడి చేశారు. ‘‘మల్లా రెడ్డి డౌన్ డౌన్’’ అంటూ నినాదాలు చేశారు..

Telangana minister's convoy attacked during meeting of Reddy community

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అతి కష్టం మీద మల్లారెడ్డిని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు.  ఈ సభకు రెడ్ల ఐకాసతోపాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Related posts