మద్యానికి బానిసై అమ్మమ్మపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఎస్ఐ శ్రీను కథనం ప్రకారం.. అడ్డగుట్ట బి సెక్షన్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు(80)కు ఒక కూతురు ఉన్నది. భర్త మృతి చెందడంతో కూతురు వద్దనే ఉంటుంది. వృద్ధురాలు కూతురికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో రఘు(37)కు ఇంకా వివాహం కాలేదు. అందరూ ఒకేచోట జీవనాన్ని సాగిస్తున్నారు. రఘు నిత్యం మద్యానికి బానిసై తిరుగుతున్నాడు.
ఇంట్లో ఎవరూలేని సమయంలో మద్యం మత్తులో అమ్మమ్మపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో వృద్ధురాలు అరవడంతో స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. వృద్ధురాలిని వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.
వావిలాల గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన ఈటల…