telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజీ పడిన స్టార్ హీరోలు… కారణం వాళ్ళే…!

Tollywood

సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. మహేష్ నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు`, అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో..` సినిమాలు సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. అయితే రెండు సినిమాలూ జనవరి 12నే థియేటర్లలోనికి రావాలని నిర్ణయించుకోవడం ఆందోళనకరంగా మారింది. రెండు భారీ సినిమాలు ఒకే రోజున విడుదలైతే ఓపెనింగ్స్ పంచుకోవాల్సి వస్తుందని, థియేటర్లు దొరకడం కష్టమవుతుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ జోక్యం చేసుకుని రెండు సినిమాల నిర్మాతల మధ్య రాజీ కుదిర్చింది. నిర్మాతలు అనీల్ సుంకర, చినబాబుతో మాట్లాడి సర్దిచెప్పింది. ఇద్దరూ రాజీకి రావడంతో విడుదల తేదీల విషయంలో సందిగ్ధత తొలగిపోయింది. మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు` జనవరి 11వ తేదీన, అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో..` జనవరి 12న ప్రేక్షకుల ముందకు రాబోతున్నాయి. ఇక, రజినీకాంత్ `దర్బార్` సినిమాను 9వ తేదీన, కల్యాణ్ రామ్ `ఎంత మంచివాడవురా`ను జనవరి 15న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

Related posts