దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయనున్నారా? అంటే అవునని సమాధానం ఇచ్చింది నటి ముస్కాన్. రీసెంట్గా ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని ధృవీకరించారు. వివరాల్లోకెళ్తే `ఢమరుకం` శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రాగల 24 గంటల్లో`. ఇందులో ఈషారెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్ ప్రధాన పాత్రధారులు. ముస్కాన్ కీలక పాత్రలో నటిచింది. ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన తదుపరి సినిమాకు సంబంధించిన విశేషాలను తెలిపారు. ముస్కాన్ తదుపరి చిత్రం `రాధాకృష్ణ` పేరుతో తెరకెక్కుతోంది. శ్రీనివాసరెడ్డినే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రమిది. ఇందులో లక్ష్మీపార్వతి కీలక పాత్రలో నటించారట. లక్ష్మీపార్వతితో కలిసి నటించడం తనకెంతో హ్యాపీగా అనిపించిందని ముస్కాన్ తెలియజేసింది.
previous post
next post