telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి నితిన్‌తో రొమాన్స్ చేయనున్న కీర్తి

యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘భీష్మ’ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా పట్టాలెక్కించాడు నితిన్. ‘మహానటి’ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్ సరసన ‘రంగ్ దే’లో నటిస్తూనే ఈ సినిమా తర్వాత మరోసారి నితిన్‌తో రొమాన్స్ చేయనుంది కీర్తి. ‘రంగ్ దే’ తరువాత నితిన్ మూడు సినిమాలు చేయనున్నాడు. మూడవ సినిమాగా ఆయన ‘పవర్ పేట’ చేస్తున్నాడు. ఈ సినిమాకి కృష్ణచైతన్య దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించనుందట. అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని సమాచారం. కీర్తి సురేష్ వరుస సినిమాలతో చాలా బిజీగా గడుపుతుంది. షూటింగ్ లు పూర్తి స్థాయిలో మొదలైతే కీర్తి చేతినిండా పనితో ఫుల్ బిజీగా మారిపోనుంది. ఇప్పటికే కీర్తి నటించిన ‘పెంగ్విన్’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. మరో సినిమా ‘మిస్ ఇండియా’ కూడా ఓటిటి రిలీజ్ కు సిద్ధమైంది.

Related posts