టీఆర్ఎస్ ప్రభుత్వం పై టీజేఎస్ అధినేత కోదండరాం విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రభుత్వ అధికారులే డబ్బులు పంచారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తమ సొంత పనులకు వాడుకుంటోందని టీజేఎస్ అధినేత కోదండరాం విమర్శించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు టీఆర్ఎస్ కు ఓటు వేయాలని డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు ఎలా గల్లంతయ్యాయని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వీవీప్యాట్లను తీసుకొచ్చారని, అభ్యర్థులకు అనుమానాలు ఉన్నచోట వాటి స్లిప్పులను లెక్కించాల్సి ఉన్నప్పటికే ఎక్కడ కూడా వాటిని లెక్కించలేదని మండిపడ్డారు. ఈ విషయంలో ఈసీ రజత్ కుమార్ వ్యవహారశైలిపై అందరికీ అనుమానాలు ఉన్నాయని చెప్పారు. రజత్ కుమార్ పై విచారణ జరిపించాలని కోదండరాం డిమాండ్ చేశారు.