telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కంపెనీకి తొత్తుల్లా ప్రభుత్వ పెద్దలు: లోకేశ్ ట్వీట్

Nara Lokesh

విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విటర్ లో స్పందించారు. ఆందోళనకు దిగిన వారిపట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న తీరు సరికాదని అన్నారు. ఎలాంటి మెడికల్‌ క్యాంపులు లేవు, షెల్టర్లు లేవు, అంతా కలుషితం అయిపోయింది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటాయని పేర్కొన్నారు.

మా సమస్యలు పరిష్కరించండి అని స్థానిక యువత ఆందోళన తెలుపుతుంటే వారిని అడ్డుకొని కంపెనీకి తొత్తుల్లా ఏపీ ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడం మంచిది కాదని లోకేశ్ ట్వీట్ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇన్ని సమస్యలు ఉంటే సీఎం జగన్ గారు రూ.పది కోట్లు ఇస్తాం, రూ.30 కోట్లు ఇస్తామని చెప్పడంపై స్థానిక యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

Related posts