telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను మోసం చేసిన దళారీ అశోక్ పై కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు

శ్రీవారి దర్శనం పేరుతో భక్తులకు టోఫీ పెట్టి పరారైన దళారీ.  తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులను మోసం చేసిన దళారీ అశోక్.

శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని రూ.నాలుగు లక్షల రూపాయలు భక్తుల నుంచి వసూలు,  డబ్బులు ఆన్ లైన్ ద్వారా వేసుకున్న అనంతరం ఫోన్ ఆఫ్ చేసిన అశోక్ అనే వ్యక్తి.

దళారీ అశోక్ ఫోన్ పనిచేయకపోవడంతో విజిలెన్స్ అధికారులకు భక్తుడు భజరంగ్ అమన్ గోయల్ ఫిర్యాదు చేసారు.

భక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు.

Related posts