అసెంబ్లీ లాబీలో పల్లాని కలిసి వివరణ ఇచ్చుకున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు.
ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు, ఎంపీ చిన్నీతో వివాదం పై చర్చించాను. కొలికిపూడికి తాను చెప్పాల్సింది చెప్పేశానన్న పల్లా శ్రీనివాసరావు.
తిరువూరు వివాదాలు గతం గత – అన్నీ ముగిసినట్లే, నా నియోజకవర్గంలో ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తా. పలు పరిణామాలు పార్టీకి ఇబ్బంది కలిగించి ఉంటే చింతిస్తున్నాను అన్నారు.
ఇకపై అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతా, ఇక పై ఏ సమస్య ఉన్నా జోనల్ కోఆర్డినేటర్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్తాను. రాజకీయాల కోసం కులం కార్డు తీయటం నా అభిమతం కాదు.
ఈ విధానానికి నేను పూర్తి వ్యతిరేకిని, నా చుట్టూ ఉన్న ఒకరిద్దరు, ఎంపీ చుట్టూ ఉన్న ఒకరిద్దరి వల్ల ఇప్పటి వరకూ సమస్యలు వచ్చి ఉండొచ్చు.
నావైపు నుంచి అలాంటి సమస్యలు ఇక పై పునరావృతం కావు, మారిన పరిణామాలు ఇకపై మీరే చూస్తారు అని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అన్నారు.


ఆస్పత్రుల్లో పడకలు కరువయ్యాయి: ఉత్తమ్