హైదరాబాద్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సంఖ్య పెరుగుతోంది. మంచి ఉద్యోగం, జీతం అన్నీ ఉన్నా పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగరంలో రమ్యకృష్ణ అనే ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని సామ్రాట్ అపార్ట్ మెంటులో ఈ ఘటన చోటుచేసుకొంది.
మృతురాలికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఆమె భర్త గోపి కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. జీవితం ఎంతో సాఫిగా సాగుతున్నప్పటికీ ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. భార్యాభర్తలు సంతోషంగా ఉండేవారని చుట్టుపక్కల వారు చెపుతున్నారు. ఘటనా స్థలికి చేసుకున్న పోలీసులు సైసూడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మా ప్రభుత్వంలో ఆడపిల్లలకు పూర్తి రక్షణ: ఎమ్మెల్యే రోజా