telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎంఐఎంతో కలిసి తెలంగాణలో మత ఘర్షణలకు టీఆర్‌ఎస్  ప్లాన్ -బండి సంజయ్

*ప్రజాసంగ్రామ యాత్రను ఎవ‌రూ ఆప‌లేరు..
*ఎంఐఎంతో కలిసి తెలంగాణలో మత ఘర్షణలకు టీఆర్‌ఎస్  ప్లాన్

టీఆర్‌ఎస్‌ కాదు… ఎవరు అడ్డం వచ్చినా ప్రజాసంగ్రామ యాత్రను ఆప‌లేరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్ల‌డించారు. రాడ్ లతో వచ్చినా రాళ్లతో వచ్చినా సరే యాత్ర చేసి తీరుతామని ప్రకటించారు. 27 వ తేదీన హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ జరిపి తీరుతామన్నారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్న బండి సంజయ్…కరీంనగర్‌లోని తన నివాసంలోనే దీక్ష చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్​ కుంభకోణం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవితపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరలించడానికే నన్ను అరెస్టు చేశార‌ని ఆరోపించారు.

Image

కుటుంబ పాలన ఎంత ప్రమాదకరమో ఇక్కడ చూస్తే అర్థమవుతుందన్నారు. ఎక్కడ ఐటీ దాడులు చేస్తున్నా ప్రతి దాంట్లో వీళ్లే కనిపిస్తున్నారన్నారు. లిక్కర్, ల్యాండ్, డ్రగ్స్, రియల్ ఎస్టేట్‌, పేకట అన్నింటిలో వాళ్లే కనిపిస్తున్నారని ఆరోపించారు. 

ఎంఐఎంతో కలిసి తెలంగాణలో మత ఘర్షణలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్లాన్ చేసిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు .రెండు మూడు రోజుల్లో అలాంటివి చేసి బీజేపీని దోషిగా చూపించబోతున్నారని అన్నారు. దీని కోసం ఎమ్మెల్యేలకు, వారి బిడ్డలకు కర్రలు ఇచ్చి రోడ్లపైకి పంపిస్తున్నారని అన్నారు. 

 

Related posts