ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మంత్రి నారా లోకేశ్. తాను మొదటి సారి పవన్ను కలిసిన సందర్భం గురించి చెప్పారు.
కాకినాడ జేఎన్టీయూలో జరిగిన ‘హలో లోకేష్’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన చాలా కూల్గా సమాధానాలు ఇచ్చారు.
ఈ క్రమంలో పవన్, లోకేశ్.. ఇద్దరూ సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ అనుబంధంతో మెలుగుతున్నారు అసలు మీ బంధం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది? అని ఓ విద్యార్థి నుంచి ప్రశ్న వచ్చింది.
దీనికి లోకేశ్ సమాధానమిస్తూ “తాను ఏపీలో 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మొదటిసారి జనసేన అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ను కలిశాను.
అప్పుడు సీఎం చంద్రబాబు .. ఆయన్ను డిన్నర్కు ఆహ్వానించారు. అప్పడే ఆయన్ను మొదటిసారి చూడటం.. అంతకుముందు సినిమాల్లోనే చూశా” అని లోకేశ్ తెలిపారు.
ఆనాటి నుంచి తమ బంధం కొనసాగిందని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబును 2023 సెప్టెంబర్లో అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించినప్పుడు పవన్ అక్కడికి వచ్చారని చెప్పారు.
ఆరోజు పవన్ కళ్యాణ్ తనతో మాట్లాడిన విధానం, తమ కుటుంబానికి అండగా నిలిచిన విధానం తనపై ఎంతో ప్రభావం చూపిందన్నారు.
దీన్ని తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని లోకేశ్ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారని, అందరూ ఇంటికి వస్తారని విద్యార్థులతో లోకేశ్ అన్నారు.
కానీ కష్టం వచ్చినపుడు చాలా తక్కువ మంది మనకు అండగా నిలబడతారు అని అన్నారు. అలాంటి వారే నిజమైన మిత్రులు అని విద్యార్థులకు లోకేశ్ చెప్పారు.
కాగా, ఈ కార్యక్రమంలో తన జీవితంలోని పలు విషయాల గురించి నారా లోకేశ్ విద్యార్థులతో పంచుకున్నారు. తాను అమెరికా విద్యావిధానంలో చదివానని.. అక్కడ హాజరుకు కూడా మార్కులు ఉంటాయని చెప్పారు.
మార్కుల కోసమైనా తాను కాలేజీ బంక్ కొట్టలేదని లోకేశ్ చెప్పారు. ఇక తనకు 90 శాతం అటెండెన్స్ ఉంటే తన భార్య బ్రాహ్మణికి వంద శాతం ఉండేదని కాలేజీ రోజులను లోకేశ్ గుర్తుచేసుకున్నారు.


టీడీపీకి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యం: మంత్రి కన్నబాబు