telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మా హయాంలో ట్రాక్టర్ ఇసుక ధర రెండు వేలు: అచ్చెన్నాయుడు

ache Naidu tdp

ఏపీలో ఇసుక కొరతపై శ్రీకాకుళంలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూటీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక ధర రెండు వేలు ఉంటే, ఇప్పుడు వైసీపీ హయాంలో దాని ధర పది వేల రూపాయలు అయిందన్నారు. మిగతా ఎనిమిది వేలు ఏ పందికొక్కులు తింటున్నాయోనని మండిపడ్డారు.

.అవగాహన, ఆలోచనలేని ఒక దుర్మార్గమైన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఏదైనా ఒక మంచి పని ద్వారా శుభకార్యానికి శ్రీకారం చుడతారు, కానీ, ఈ ముఖ్యమంత్రి, అమరావతిలోని ప్రజావేదికను కూల్చి అశుభకార్యానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఈ ఐదు సంవత్సరాల్లో అన్నీ అశుభాలే జరుగుతాయని అనుకుంటున్నాని అన్నారు. ఈ నాయకుడికి ముందుచూపు, అవగాహన లేవని దుయ్యబట్టారు.

Related posts