telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు వార్తలు

జగన్ అండ్ కో నిజస్వరూపం ఇప్పడు రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయింది: మంత్రి పయ్యావుల కేశవ్

వైసీపీ వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. జగన్ అండ్ కో నిజస్వరూపం ఇప్పడు రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు.

సభలో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ప్రశ్నవేసి చివరకు వైసీపీనే ఇరకాటంలో పడిందని సెటైర్లు గుప్పించారు.

ఇవాళ (గురువారం) అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. వైసీపీ నేతలు అనుకున్నది తాము చెప్పాలంటే ఎలా చెబుతామని ప్రశ్నించారు.

వారు అడిగిన అన్ని అంశాలనూ తాము చర్చకు పెట్టామని స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్, అగ్రికల్చర్ వంటి అన్నిఅంశాలపై చర్చ పెట్టామని తేల్చిచెప్పారు.

తమ ప్రభుత్వం వారికన్నా ముందుగానే వచ్చి స్టేట్‌మెంట్ ఇస్తామని చెబుతోందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రేపు (శుక్రవారం) అగ్రికల్చర్ మీద చర్చ చేస్తామని తెలిపారు.

వచ్చే నెల 4వ తేదీన లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటలు వరకూ కూడా కల్తీ నెయ్యిపై చర్చకు సిద్ధమని ఈరోజే చెప్పామని ప్రస్తావించారు.

వైసీపీ నేడు ఆత్మరక్షణలో పడిందని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ప్రశ్న వేసి భంగపడిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు.

Related posts