telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఏపీ హైకోర్టు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు చేసింది

అక్రమ మద్యం కేసులో వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు నేడు చెవిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేసింది.

భాస్కర్‌రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్‌ నాయుడులకు కూడా హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. కాగా, ఏపీలో రూ. వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని అందులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాత్ర కూడా ఉందంటూ 2025 జూన్‌17న ఆయన్ను సిట్‌ బెంగుళూరులో అరెస్ట్‌ చేసారు.

చివరికి 226 రోజుల తర్వాత ఆయనకు బెయిల్‌ లభించింది.

Related posts