సుజనా రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘గమనం’ మూవీ రియల్ లైఫ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతుండటం విశేషం. నిత్యామీనన్ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్న ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయారాజా సంగీత సమకూరుస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఒకవైపు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తూనే.. రమేష్ కరుటూరి, వెంకీ పుషడపులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ‘గమనం’పై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను బుధవారం ఉదయం విడుదల చేశారు. ఐదు భాషలకు సంబంధించి ఆయా భాషల్లో అగ్రనటులతో ‘గమనం’ ట్రైలర్ను లాంచ్ చేయించిన యూనిట్. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హిందీలో సోనూసూద్, తమిళంలో జయం రవి, కన్నడలో శివ రాజ్కుమార్, మలయాళంలో పహాద్ ఫైసల్.. ఈ ట్రైలర్ను లాంచ్ చేశారు.
previous post

