వరంగల్ చారిత్రక కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు 300 ఎకరాల భూమిని కేంద్ర విమానయాన శాఖకు అప్పగించిన ఈ రోజు తెలంగాణ విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అన్నారు..
1930లో నిజాం కాలంలోనే నిర్మితమై, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా వెలుగొందిన మామునూరు వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు.
రూ. 300 కోట్ల నిధులు కేటాయించి, దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశాము అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
సహకారం అందిస్తున్న కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు కి, కేంద్ర ప్రభుత్వానికి భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు.

