telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో గత పది రోజుల్లో 29 శాతం కేసులు!

Corona

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జాతీయ సగటు కంటే మూడు రెట్లు అధికంగా రాష్ట్రంలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 51.13 శాతం గత పది రోజుల్లోనే నమోదయ్యాయి. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసులు కూడా పెరుగుతుండడం గమనార్హం. గత పది రోజుల్లో అంటే జూన్ 29 నుంచి జులై 8 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 52,163 మందిని పరీక్షించగా, 15,117 కేసులు వెలుగు చూశాయి. అంటే ఈ పది రోజుల్లో 29 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,34,801 శాంపిళ్లను అధికారులు పరీక్షించగా 29,536 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ గణాంకాల ప్రకారం చూస్తే రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల శాతం 21.91గా ఉంది. ఇది జాతీయ సగటు కంటే ఎంతో ఎక్కువ. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.07 కోట్ల నమూనాలు పరిశీలించగా 7.67 లక్షల మందికి కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. అంటే జాతీయ సగటు పాజిటివ్‌ రేటు 7.1 శాతంగా ఉంది.

Related posts