telugu navyamedia
రాజకీయ వార్తలు

నేపాల్ లో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేత!

Tv dish

ఇటీవల కాలంలో భారత్ కు వ్యతిరేకంగా నేపాల్ అనుసరిస్తున్న తీరుపై భారాత్ లో విమర్శలు వెల్లువిరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేపాల్‌లో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేశారు కేబుల్‌ ఆపరేటర్లు. దూరదర్శన్ ప్రసారాలను మాత్రం కొనసాగిస్తున్నట్లు నేపాల్ కేబుల్ టీవీ ప్రొవైడర్లు… ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. ఇందుకు సంబంధించి నేపాల్ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.

భారత్ కు చెందిన వార్తా ఛానల్స్ ఓలి శర్మకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తున్నాయని, అలాంటి వాటిని నిషేధించాలని ఆ దేశ ఉపప్రధాని నారాయణ కాజీ శ్రేష్ఠ గురువారం ఉదయమే ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్లు భారత్ కు చెందిన టీవీ ప్రసారాలను నిషేధించినట్లు తెలిస్తోంది. కానీ కేబుల్ ఆపరేటర్లు మాత్రం తామే స్వచ్ఛందంగా ప్రసారాలను ఆపేశామని ప్రకటించారు.

Related posts