telugu navyamedia
క్రీడలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఉప్పల్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ ప్రాక్టీస్

India westendies cricket

సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన సిరీస్‌లలోనూ టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత భారత్ స్వదేశంలో వెస్టిండీస్ జట్టుతో తలపడనుంది. పర్యాటక జట్టుతో మూడు టీ-20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలి టీ-20 ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం జరుగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి.

నేడు ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు వెస్టిండీస్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు భారత జట్టు ప్రాక్టీస్ చేస్తాయి. ఇందుకోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Related posts