తెలంగాణ సీఎం కేసీఆర్తో మైత్రికి జగన్ తహతహలాడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర రైతాంగానికి వెన్నుపోటు పొడుస్తున్న కేసీఆర్తో పొత్తుకు సిద్ధపడటం ద్వారా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆంధ్ర ప్రజల ద్రోహిగా మారారని అన్నారు. శుక్రవారం ఆయన జగన్కు ఒక బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఎగువ నుంచి రావాల్సిన నీటిని ఇవ్వకుండా అన్యాయం చేస్తున్న కేసీఆర్తో జగన్ పొత్తుకు సిద్దపడుతున్నాడని విమర్శించారు.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి తీసుకొంటున్న నీటిని తక్కువ చేసి దొంగ లెక్కలు చూపించారు. అక్రమంగా 120 టీఎంసీల నీటిని వినియోగించుకొనేలా పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఒక్క రోజు కూడా వీటిపై నోరు మెదపలేదు. మిగులు జలాల్లో వాటా వద్దని లేఖ ఇవ్వడం ద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డి రైతాంగం గొంతు కోస్తే… ఇప్పుడు కేసీఆర్కు తొత్తుగా మారి జగన్ మరింత ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.