స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించారు. తన కలల ప్రాజెక్ట్ “సైరా”ను తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా పట్టాలెక్కించాడు చిరు. ఈ సినిమా సురేందర్రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అన్ని ప్రాంతీయ భాషలలో విడుదల చేశారు. గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్తో మంచి వసూళ్లను సాధిస్తుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం అమెరికాలో మంగళవారం 308 లొకేషన్స్లో ప్రదర్శించిన ప్రీమియర్స్లో 8,57,765 డాలర్ల (6.16 కోట్ల రూపాయలు)ను రాబట్టినట్లు పేర్కొన్నారు. అలాగే ఆస్ట్రేలియాలోనూ ఉదయం 11 గంటల వరకు 39 లొకేషన్స్లో 1,89,237 ఆస్ట్రేలియన్ డాలర్స్ను సాధించినట్లు పేర్కొంటున్నారు.
previous post