*ఆరేళ్ల క్రితమే రమ్య-నేను విడిపోయా..
*ఇలాంటి సమస్యలు గుర్తించే రమ్య-నేను విడిపోయాను..
*రమ్య మోసాలతో తనకు ఎలాంటి సంభందం లేదన్న నరేష్..
*మాజీ మంత్రి రఘువీరా రెడ్డి పేరుతో కూడా మోసాలు..
*దీనిపై మూడు నెలలు క్రితమే నోటీస్ ఇచ్చా..
రమ్య రఘుపతి పాల్పడిన వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆరేళ్ల క్రితమే రమ్య-నేను విడిపోయాము అని నటుడు నరేష్ తెలిపారు.
మాజీ భార్య రమ్య రఘుపతిపై నరేష్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తోందంటూ ఆమెపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. నటుడు నరేష్కు రమ్య రఘుపతి మూడో భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె ఈమె. తొమిదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. అయితే కొన్నాళ్ల క్రితం మనస్పర్థలు రావడంతో విడిపోయారు.
అయితే నరేష్ సహా ఆయన కుటుంబంతో దిగిన ఫోటోలను అడ్డు పెట్టుకొని కొందరు మహిళల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నరేష్కు చెందిన ఆస్తులను తన ఆస్తులుగా చెప్పి అధిక వడ్డీ పేరుతో, రిజిస్ట్రేషన్ల పేరుతో కోట్లల్లో మోసానికి పాల్పడింది. దీనిపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.
ఈ వివాదంపై నటుడు నరేష్ స్పందించారు… రమ్య రఘుపతి పాల్పడిన వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తొమ్మిదేళ్ల క్రితమే పెళ్ళి చేసుకున్నాం..ఇలాంటి సమస్యలు గుర్తించే ఆరేళ్ల క్రితం విడిపోయాను అంటూ సీనియర్ నటుడు వాపోయారు. తనకు గానీ తనబంధువులతో గానీ టచ్లో లేదని తెలిపారు. బాధితులకు నేను ఒక్కటే చేబుతున్నా..దయచేసి తనకు రమ్య మోసాలతో సంబంధం లేదంటూ నరేష్ విజ్ఞప్తి చేశారు.
మాదాపూర్ డిసిపి కె శిల్పవల్లి మాట్లాడుతూ.. రమ్య రఘుపతి మహిళలను దాదాపు 40 లక్షల రూపాయల వరకు మోసం చేసిందని ఆరోపించారు. తాము ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా రమ్యను కలిశామని, ఆమె తనను మాజీ మంత్రి కుమార్తెగా, అలాగే నటుడు నరేష్ భార్యగా పరిచయం చేసిందని మహిళలు పేర్కొన్నారు.
కాగా.. ప్రస్తుతానికి ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేయగా… ఇంకా బాధితులు ఎవరో గుర్తించాల్సి ఉంది.