telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఏపీపీఎస్సీ ఆఫీసు ముందు నిరుద్యోగుల ఆందోళన..

Student Unions at APPSC Office Vijayawada

గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. యువజన సంఘాలు, నిరోద్యోగులు అక్కడికి చేరుకొని విద్యార్థులకు మద్దతు పలుకడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.

ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ రిజర్వేషన్ల అమలులో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఇటీవల ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను రద్దు చేయాలనీ, పరీక్షను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అధికారుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు.

Related posts