దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్.రాకేష్ కాచిగూడ-నిజామాబాద్ మార్గంలో జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు తెలిపారు. కాచిగూడ-నిజామాబాద్ జనసాధారణ్ స్పెషల్ (రైల్ నెంబర్: 07013) కాచిగూడ నుంచి అక్టోబర్ 19న ఉదయం 11గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 3గంటలకు నిజామాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో నిజామాబాద్-కాచిగూడ జనసాధారణ్ స్పెషల్ (రైల్ నెంబర్: 07014) నిజామాబాద్ నుంచి అక్టోబర్ 19న మధ్యాహ్నం 3.40గంటలకు బయల్దేరి, అదే రోజు రాత్రి 7.30గంటలకు కాచిగూడ చేరుతుంది.
కాచిగూడ-కర్నూలు సిటీ జనసాధారణ్స్పెషల్ (రైల్ నెంబర్: 07023) కాచిగూడ నుంచి అక్టోబర్ 19న ఉదయం 11.50గంటలకు బయల్దేరి, అదే రోజు సాయంత్రం 4.15గంటలకు కర్నూలు సిటీ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీ-కాచిగూడ జనసాధారణ్స్పెషల్ (రైల్ నెంబర్:07024) కర్నూలు సిటీ నుంచి అక్టోబర్ 19న సాయంత్రం 5గంటలకు బయల్దేరి, అదే రోజు రాత్రి 9.30గంటలకు కాచిగూడ చేరుతుంది.
నెపోటిజం అంటూ సూర్య, విజయ్ పై మీరా మిథున్ తీవ్ర వ్యాఖ్యలు…!