ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. దివి నుంచి భువికి.. వచ్చిన గానగంధర్వుడు. తన గాత్రంతో వీనుల విందుగా మధురగానాలను ఆలపించి..తన పని పూర్తి చేసుకుని సంగీత ప్రియులకు, తన అభిమానులకు కన్నీరు మిగులుస్తూ.. మళ్ళీ భువి నుంచి దివికేగిన మహనీయులు. నేటితో దివికేగి ఒక సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గంగంధర్వుడిని జ్ఞాపకం..చేసుకుంటున్నారు. కోట్లాది మందికి ఆత్మానందాన్ని పంచిన అమరగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం .తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మొదలు అనేక భాషా నటులకు, హీరోలకు వేల పాటలు పాడారు. ఆయన గళం నుంచి జాలువారే.. ప్రతిస్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే.

భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన వేలాది పాటలతో అందరి హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. క్లాస్ సాంగ్ అయినా, మాస్ బీట్ అయినా, మెలోడీ సాంగ్ అయినా తన గాత్రంతో ఆ పాటకు ప్రాణం పోసే ఆ సరస్వతీ పుత్రుడు బాలుగారు. సామాన్య గాయకుడిగా వెండి తెరపై అడుగు పెట్టి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడిన ఘనత ఆయన సొంతం.

బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం ..
ఎస్పీబాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు.ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4వ తేదీన నెల్లూరులో పీ సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. బాలుకి ఇద్దరు సోదరులు, నలుగురు చెల్లెలు. అందులో గాయని ఎస్పీ శైలజ, ఎస్పీ వసంత గాయకులుగా సుపరిచితులు. ఎస్పీ బాలసుబ్రమణ్యం సావిత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పల్లవి, ఎస్పీ చరణ్ సంతానం. ఇద్దరూ వెండి తెరపై గాయకులుగా అడుగు పెట్టారు.

బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో సాంప్రదాయ వీరశైవ ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి పేరొందిన హరికథా కళాకారుడు. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. తండ్రి భక్తిరస నాటకాలు కూడా వేస్తుండేవాడు. తండ్రిని చూస్తూ పెరిగిన బాలుకి చిన్నతనం నుంచి సంగీతంపై ఆసక్తి కలిగింది. దీంతో బాలు ఐదేళ్ళ వయసులో తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించారు. ప్రాథమిక విద్య నగరి లోని మేనమామ శ్రీనివాసరావు ఇంటిలో ఉంటూ పూర్తి చేశారు.

శ్రీకాళ హస్తిలోని బోర్డు పాఠశాలలో స్కూలు ఫైనలు చదివాడు. అయితే ఎస్పీబీ చదువులోనే కాక, ఆటల్లో కూడా ఎప్పుడూ ఫస్ట్.. ఇక శ్రీకాళహస్తిలో చదువుతున్న సమయంలో జి. వి. సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు చెంచులక్ష్మి సినిమాలో సుశీల పాడిన పాలకడలిపై శేషతల్పమున అనే పాటను ఆలపింపజేసి టేపు మీద రికార్డు చేయించారు. అనంతపురంలో ఇంజనీరింగులో సీటుని వదులుకున్న బాలు మద్రాసు ప్రయాణమయ్యారు. తండ్రి కోరిక బాలు ఇంజనీర్ కావడం దీంతో చెన్నై లో ఇంజనీరింగుకి ప్రత్యామ్నాయమైన ఎ.ఎం.ఐ.ఇ కోర్సులో చేరారు.

ఇంజనీర్ చదువుతున్న సమయంలోనే బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ప్రముఖ సంగీత దిగ్గజం ఎస్పీ కోదండపాణి శిష్యరికంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం 1966లో డిసెంబర్ 15 తేదీన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా అతని ప్రస్థానం ప్రారంభమైంది.

తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.
ఓ వైపు నేపధ్య గాయకుడిగా పాటలు పడుతూనే.. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్గా, డబ్బింగ్ హోస్ట్గా , నటుడిగా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు బాలు. 1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రం అందించాడు.

పురస్కారాలు..
40 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే అరుదైన రికార్డ్ సృష్టించిన గాయకులూ బాలు.. తెలుగు వారు కావడం మనకందరికీ గర్వకారణం. వివిధ భాషల్లో పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. సింగర్ గా , నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న భాహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. పద్మశ్రీ , పద్మభూషణ్ ,పద్మ విభూషణ్, డాక్టరేటు వంటి అనేక బిరుదులను అందుకున్న బాలు

గతేడాది వైరస్ బారిన పడి స్వర్గస్తులయ్యారు. 2020, ఆగస్టు 5 తేదీన కరోనా వ్యాధి బారిన పడ్డ బాలు గారు.. చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కోలుకుని తిరిగి వస్తారని అందరూ ఎదురుచూస్తున్నా వేళ.. అంతర్యామీ అలసితి సొలసితి అంటూ దివికేగారు.ఇందరికి ఆత్మానందాన్ని పంచిన బాలుకి ప్రధమ వర్ధంతి సందర్భంగా నవ్యమీడియా నివాళులపిస్తుంది.


పవన్పై ‘గుండు’ కామెంట్స్ చేసిన రోజా… లైక్ కొట్టిన పూనమ్ కౌర్