టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోయిన్ల సరసన అవకాశాలు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతోంది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది రకుల్. సినీ రంగంలోకి ప్రవేశించి దశాబ్దం కావొస్తున్నా ఇప్పటికీ అదే గ్లామర్ను మెయింటైన్ చేస్తూ అవకాశాలు అందుకుంటోంది. రకుల్ “వెంకటాద్రి ఎక్స్ప్రెస్”తో తెలుగు వారికి దగ్గరైంది. ఆ తరువాత ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మధ్య తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గాయి. ఇటీవల అజయ్ దేవ్గన్తో ‘దేదే ప్యార్ దే’ అనే సినిమా చేసింది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. కాగా అటు తమిళం, ఇటు తెలుగు నుంచి అవకాశాలు పెద్దగా లేకపోవడంతో రకుల్ ప్రస్తుతం బాలీవుడ్పై దృష్టి సారించింది. అక్కడ జరిగే పార్టీలకు, ఫంక్షన్లకు క్రమం తప్పకుండా హాజరవుతూ ప్రముఖుల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తోంది. అయితే పార్టీలకు హాజరైనంత మాత్రన సినిమా అవకాశాలు రావని రకుల్ తాజాగా అభిప్రాయపడింది. “పార్టీలకు హాజరైనంత మాత్రాన హీరోయిన్లకు అవకాశాలు వచ్చేస్తాయన్నది అపోహ మాత్రమే. అయితే కాంటాక్ట్లో ఉండటం వల్ల మనకి కావాల్సిన అవకాశాలు రావొచ్చు. కానీ, ఇక్కడ కాంటాక్ట్ కంటే ట్యాలెంట్ అనేదే ముఖ్యం. మనకు ట్యాలెంట్ ఉంటే పార్టీలకు వెళ్లకపోయినా అవకాశాలు వస్తాయి” అని రకుల్ చెప్పింది.
previous post
next post
ప్రకాశ్రాజ్ ‘మా’ని మరింత అభివృద్ధి చేయగలడు: బండ్ల గణేశ్