telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న శివాని రాజశేఖర్

Shivani

శివాని రాజశేఖర్, అడవిశేష్‌, శివానీ కాంబోలో ఫైనల్‌ చేసిన “టూ స్టేట్స్”‌ ప్రాజెక్టు 2019లో కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. తొలి సినిమాపై ఎంతో ఆశలు పెట్టుకున్న శివాని..సినిమా ఆగిపోవడంతో కాస్త నిరాశకు లోనైంది. ఇక శివాని తాజాగా తన టాలీవుడ్‌ ఎంట్రీని ఫిక్స్‌ చేసుకుంది. శివాని ఇటీవలే యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ కథాంశంతో రానున్న సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఎన్నో సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించి మంచి పేరు తెచ్చుకున్న తేజ సజ్జతో డైరెక్టర్ మల్లిక్‌ రామ్‌ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ సినిమాలో శివానిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సుమంత్‌తో కలిసి “నరుడా డోనరుడా” సినిమా తీశాడు మల్లిక్‌రామ్‌.

Related posts