తిరుపతి తిరుపతిలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం వసతిగృహం దగ్గర శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు ఆందోళనకు దిగారు. 26 నుంచి ఆన్లైన్లో ఉచిత దర్శనం టోకెన్ల కేటాయింపు నేపథ్యంలో ఈ రోజు టోకెట్లను కూడా నిన్ననే శ్రీనివాసంలో కేటాయించింది.
అయితే..అ ఈ విషయం తెలియక తిరుపతికి చేరుకున్న వేలాది మంది శ్రీవారి భక్తులు శ్రీనివాసం వద్ద టోకెన్లు ఇవ్వకపోవటంతో అసహానికి గురైయ్యారు. టోకెన్లు ఇవ్వాలంటూ భక్తులు అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. భక్తుల ఆందోళనతో శ్రీనివాసం దగ్గర పెద్ద యెత్తున పోలీసులను మోహరించారు. దీంతో శ్రీనివాసం వసతి గృహం నుంచి భక్తులను వెనక్కి పంపేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో తిరుపతి శ్రీనివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ..