telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ

ఆంధ్రప్రదేశ్‌ కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సమీర్ శర్మకు మాజీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ బాధ్యతలు అప్పగించారు. తొమ్మిది నెలలపాటు ఆదిత్యనాథ్‌ దాస్ ఏపీ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమీర్ శర్మ మీడియాతో మాట్లాడారు. ‘‘నవరత్నాల అమలు కోసం కృషి చేస్తా. సీఎస్‌గా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జనగ్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. అందరి సహకారంతో పని చేస్తాను’’ అని తెలిపారు.

Related posts