ఏప్రిల్ 11న ఏపీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.
అయితే కొత్త మంత్రివర్గం రూపుద్దిద్దుకుంటున్న నేపథ్యంలో పాత, కొత్త మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందులో పాల్గొననున్నారు.
మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు కార్యక్రమం ఉంటుంది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛ్మైరన్లు, అధికారులకు ఆహ్వానాలు పంపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా పాసులు జారీ జారీ చేశామని ఏపీ సీఎంవో ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేసింది..
ప్రజలు ఇచ్చే తీర్పుతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలి: వంగవీటి రాధా