telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో సుమారు 40 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు

ఈరోజు తెలంగాణలో సుమారు 40 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.

లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర స్థాయి కీలక నేతలతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం.

లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను వెల్లడించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ‌ మధ్యాహ్నం 2:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

లొంగిపోయిన వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి, వారి లొంగుబాటుకు గల కారణాలను వివరించనున్నారు.

“ఆపరేషన్ కగార్”తో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలోనే ప్రకటించారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్లలో హిడ్మా, చలపతి, బస్వరాజ్, గణేశ్‌ వంటి అనేక మంది కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు.

అగ్ర నాయకత్వం అంతమవ్వడంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో చాలా మంది మావోయిస్టులు అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వస్తున్నారు.

Related posts