హైదరాబాద్లోని మాదాపూర్లో ఆదివారం ప్రమాదం చోటు చేసుకున్నది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో యువతి జెన్నిఫర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనలో మరో యువకుడు అజయ్ కి తీవ్ర గాయాలయ్యాయి. సంబంధిత కారు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.