బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి . ఈ సందర్భంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ..సుశాంత్ ను తలచుకుంటూ తన ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ.. ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నంటూ గుర్తుచేసుకుంది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్, రి యా చక్రవర్తి కలిసి తిరిగడం , ఈవెంట్ లకు కలిసి వెళ్లడం చేసేవారు కానీ ఏనాడు వారు డేటింగ్ చేస్తున్నామని ఎప్పుడూ ఒప్పుకోలేదు. జనవరి 21, 2020న సుశాంత్ పుట్టినరోజున మాత్రమే రియా తన సంబంధాన్ని ఇన్స్టాలో-అఫీషియల్గా చేసింది.
దురదృష్టవశాత్తు సుశాంత్ (34 ఏళ్ల) బాంద్రా అపార్ట్మెంట్లో జూన్ 14, 2020న ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో భవిష్యత్తున్న టాలెంటెడ్ నటుడు అకాల మరణం దేశాన్ని కుదిపేసింది . సుశాంత్ మరణించే సమయంలో రియా చక్రవర్తితో రిలేషన్షిప్లో ఉన్నాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణాన్ని ముంబై పోలీసులు మొదట ఆత్మహత్యగా నిర్ధారించారు.
సుశాంత్ తండ్రి కెకె సింగ్ తన కొడుకు మరణానికి కారణమని ఆరోపిస్తూ రియా, ఆమె సోదరుడు షోక్ తో పాటు మరో ఐదుగురిపై ఎఫ్ ఐఆర్ దాఖలు చేయడంతో డెత్ స్టోరీ యూటర్న్ తీసుకున్నాయి.
ఈ క్రమంలో రియా ను ఎన్సీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు సీబీఐ విచారణ చేపట్టింది. రియా సోదరుడు షోక్ చక్రవర్తి ఆరోపించిన డ్రగ్స్ కార్టెల్తో ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. రియాపై కూడా అభియోగాలు మోపగా, ఆమె పై ఉన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేసింది.
అక్టోబర్లో ఆమె జ్యూడీషియల్ కస్టడీ నుంచి విడుదలైంది. అంతేకాకుండా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ కేసులో నిధుల స్వాహా కోణంపై దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికైనా సుశాంత్కు న్యాయం చేయాలని ఆయనఅభిమానులు డిమాండ్ చేస్తున్నారు.