యంగ్ హీరో నాగశౌర్య “ఊహలు గుసగుసలాడే” సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇటీవల “ఓ బేబి” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో “హీరో”గానే కాకుండా ప్రాముఖ్యత ఉన్న స్పెషల్ రోల్స్ చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే “ఓ బేబీ” చిత్రం మంచి విజయం సాధించినప్పటికీ, ఫుల్ క్రెడిట్స్ సమంతకే దక్కాయి. తాజాగా నాగశౌర్య ప్రాజెక్ట్ సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్ బేనర్పై నాగ శౌర్య హీరోగా ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్నిడెబ్యూ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తెరకెక్కించనున్నారు. అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మేలో విడుదల కానుంది. చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
previous post